హైదరాబాద్/ సిటీబ్యూరో,ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ);జవహర్నగర్ కార్పొరేషన్లోని లబ్ధిదారులకు జీవో 58 కింద ఇండ్ల పట్టాలను మంత్రి కేటీఆర్ శనివారం అందజేయనున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలోనే అత్యధికంగా జవహర్నగర్లో 3,613 మంది లబ్ధిదారులకు పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా 2020 వరకు అవకాశం ఇవ్వడంతో మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.