తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 2 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న పలు కోర్సులకు అభ్యర్థుల నుంచి నేరుగా ప్రవేశాలకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెంట్రల్ అడ్మిషన్ కమిటీ డైరక్టర్ డాక్టర్ కోట్ల హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంఎఫ్ఏ(పెయింటింగ్,స్కల్పచర్), ఎంఏ ఐప్లెడ్ లింగ్విస్టిక్, ఎంఏ మ్యూజిక్, ఎంపిఏ థియేటర్ ఆర్ట్స్, ఎంపీఏ ఫోక్ ఆర్ట్స్, ఎంఏ తెలుగు(రాజమండ్రి ప్రాంగణం), ఎంపీఏ డ్యాన్స్(కూచిపూడి ప్రాంగణం), ఎంఏ హిస్టరీ(శ్రీశైల ప్రాంగణం)తో పాటు పి.జి డిప్లోమా, డిప్లోమా, సర్టిఫికేట్ కోర్సులకు సీట్లు మిగిలి ఉన్నందున ఆసక్తి కలిగి కొత్తగా చేరాలనుకునే అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.
అడ్మిషన్ కోసం డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 5గంటల లోగా ఆరు వందల రూపాయల డిడి( రిజిస్టార్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ పేరిట)తో పాటు దరఖాస్తును సంబంధిత శాఖలో సమర్పించాలని ఆయన సూచించారు.