బంజారాహిల్స్,జూన్ 12: బంజారాహిల్స్ రోడ్ నం.12లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం పనులను రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి శనివారం పరిశీలించారు. సుమారు గంటపాటు కమాండ్ కంట్రోల్లోని వివిధ అంతస్తుల్లో కొనసాగుతున్న పనుల పురోగతిపై ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. భవనం సెల్లార్లను, పార్కింగ్ స్థలాలను పరిశీలించి.. పలు అంశాలపై నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి తెలుసుకున్నారు. డీజీపీ వెంట నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.