సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనర్గా దేవేంద్ర సింగ్ చౌహాన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. 1997వ బ్యాచ్కు చెందిన చౌహాన్ నిజామాబాద్, మెదక్ జిల్లాల ఎస్పీ గా, ఎక్సైజ్, కేంద్ర సంస్థల్లో పలు ఉన్నత హోదాల్లో పనిచేశారు. హైదరాబాద్ అదనపు కమిషనర్గా కూడా సేవలందించారు. కాగా ఇప్పటివరకు రాచకొండ కమిషనర్గా పనిచేసిన మహేశ్ భగవత్ సీఐడీ అదనపు డీజీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహేశ్ భగవత్ నుంచి చౌహాన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ చౌహాన్ మాట్లాడుతూ.. పోలీసులందరూ నిబద్ధతతో పనిచేసినప్పుడే నేరాలను నియంత్రించి శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షించవచ్చని చెప్పారు.