కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 21 : వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ప్రాజెక్టు విభాగం, జలమండలి, విద్యుత్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జోన్ పరిధిలోని గత సమావేశాలలో తీర్మాణించిన పనుల పురోగతిపై శాఖల వారీగా చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే పనులు త్వరగా పూర్తవుతాయన్నారు. రహదారులు, జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి జంక్షన్లో ఫ్రీ లెఫ్ట్ను, ఎస్టీ రోడ్లను ఏర్పాటు చేయాన్నారు. దీంతో పాటు విద్యుత్ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, రోడ్డు డివైడర్ల దగ్గర చిన్నచిన్న మొక్కలు నాటాలన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ వీధి దీపాల స్తంభాలను తొలగించాలన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్లోని కృష్ణకుంజ్ జంక్షన్, గాజులరామారం సర్కిల్లోని ఐడీఎల్ జంక్షన్ సుందరీకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు జంక్షన్లను పరిశీలించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేయాలన్నారు. వర్షంనీటి కాలువల ఆధునీకరణ పనులపై ఆరాతీస్తూ నాలా విస్తరణకు అడ్డంకిగా ఉన్న భవనాలను, ఆస్తులను గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాలా విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. నిబంధనల ప్రకారం రోడ్డు కటింగ్ అనుమతులను వెంటనే జారీ చేయాలని.. అనుమతులు వచ్చిన తర్వాతే జలమండలి అధికారులు పనులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ అధికారుల సూచనల మేరకు ట్రాఫిక్కు అడ్డంకిగా ఉన్న చెట్ల కొమ్మలు, లైటింగ్కు అడ్డంకిగా ఉన్న చెట్ల కొమ్మలను తొలిగించే పనులను చేపట్టాలని ఫారెస్ట్ విభాగం అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ హన్మంతరావు, సీఐలు నర్సింగరావు, నగేశ్, ఎస్ఈ చిన్నారెడ్డి, సీపీ ఉమాదేవి, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.