మారేడ్పల్లి : లక్షల రూపాయాల వ్యయంతో పలు బస్తీ, కాలనీల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. శనివారం మోండా డివిజన్ పరిధిలోని మారేడ్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ సి 1211, ఎస్డీ రోడ్డు నుంచి ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంక్ వరకు 65 లక్షల వ్యయంతో విడీసీసీ రోడ్డు, 26 లక్షలతో పుట్పాత్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి. సాయన్న శంఖుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..మోండా డివిజన్ లోని బస్తీ, కాలనీల్లో కోట్ల రూపాయాల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సీసీ, విడీసీసీ రోడ్లు, తాగునీరు, డైనేజీ నూతన పైప్లైన్లు, పార్కుల అభివృద్ధి తదితర మౌళిక వసతులను అభివృద్ధి చేపట్టడం జరిగిందన్నారు.
త్వరలో మరిన్ని అభివృద్ది పనులు కూడ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ ,మహిళా నాయకులు నివేధిత, జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ జోనల్ కమిషనర్ ముకుందరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుదర్శన్, డిఈ అంజనేయు, ఏఈ రవీందర్, టీఆర్ఎస్ నాయకులు అజయే కుమార్, రాము, నర్సింహ్మ ముదిరాజ్, నళిని కిరణ్, పిట్ల నాగేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.