కీసర, జూన్ 7: మండల పరిధి రాంపల్లిదాయరలో బుధవారం రూ.55లక్షలతో మంత్రి మలారెడ్డి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలుచేశారు. రూ.20 లక్షలతో నూతన పంచాయతీ భవనం, రూ. 10లక్షలతో కమ్యూనిటీహాల్ భవన నిర్మాణం, రూ.10లక్షలతో జిన్నారం కాలనీలో కమ్యూనిటీహాల్ భవన నిర్మా ణం, రూ.10లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాతనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు.మౌలిక వసతుల కల్పనకు అత్యధిక నిధులు కేటాయించామ న్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, సర్పంచ్ అండాలుమల్లేశ్, ఎంపీటీసీ కిరణ్జ్యోతి, ఉప సర్పంచ్ రాము, వార్డు సభ్యులు శ్రీకాంత్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు సుధాకర్రెడ్డి, లక్ష్మణ్శర్మ, ప్రదీప్కుమార్, వెంకట్రెడ్డి, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
బొడ్రాయి పూజలో మంత్రి
మేడ్చల్ రూరల్, జూన్ 7: గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో జరిగిన బొడ్రాయి (నాభిశిల) ప్రతిష్ఠాపన కార్యక్రమంలో గురువారం మంత్రి మల్లారెడ్డి పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే ప్రజలకు స్వామి వారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు హేమంత్రెడ్డి, మల్లికార్జున్ ముదిరాజ్, పెంటయ్య, బాలరాజు, హంసరాణి, సాయి గీతాశ్రమ వ్యవస్థాపకుడు సాయికుమార్ పాల్గొన్నారు.