చిక్కడపల్లి : సుందరయ్య పార్కును అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరంలోనే బెస్ట్ పార్కుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ రూ.42లక్షలతో అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ రవి చారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుందరయ్య పార్కు అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ద చూపాలని సూచించారు.ప్రతి రోజు వాకింగ్ను అలవాటుగా మార్చుకోవాలన్నారు.నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్కుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
42 లక్షల రూపాయిల నిధులతో పార్కులో ఓపెన్ జిమ్, ఫ్లోరింగ్ , పిల్లల ఆటల పరికరాలు, సుందరయ్యపార్కు ప్రధాన గేటు వద్ద ఆర్చీ తదితర అభివృద్ధి చేయనున్నట్ల తెలిపారు.వాకర్స్ సమస్యలు తన దృష్టికి తీసుకోస్తే వెంటనే పరిష్కరించేందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ,టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.మోజస్, దమోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నైబర్డ్ కాలనీలో చిన్నారుల ప్లే గ్రౌండ్ పనులు ప్రారంభం
బాగ్లింగపంల్లి నైబర్డ్ కాలనీలో చిన్నారుల ప్లే గ్రౌండ్లో రూ. 6లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఉన్న పార్కుల అభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రవి చారి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.