కాచిగూడ, ఫిబ్రవరి 13 : నల్లకుంట డివిజన్ సత్యానగర్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి సోమవారం ఆయన సత్యానగర్లో పాదయాత్ర చేసి స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్న వృద్ధులను పలుకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సత్యానగర్ వాసులు దృష్టికి తెచ్చిన సమస్యలపై మాట్లాడుతూ.. సత్యానగర్లో డ్రైనేజీ సమ స్య శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రూ.40లక్షల వ్యయం తో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. బస్తీవాసులు అడిగినట్లు స్థానిక కమ్యూనిటీహాల్లో అవసరమైన సదుపాయాలతోపాటు షెడ్డు నిర్మాణం చేపడతామని అన్నారు. బస్తీ లో పాడైపోయిన బోరు మరమ్మతు పనులు సొంత ఖర్చు తో చేయిస్తానని తెలిపారు.
బస్తీ ప్రజల విజ్ఞప్తి మేరకు సొం త స్థలం ఉన్న అర్హులైన వారికి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇవ్వునున్న రూ.3 లక్షలు మంజూరు అయ్యే లా చూస్తానని చెప్పారు. అదేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాటర్వర్క్స్ డీజీఎం సన్యాసిరావు, మేనేజర్ భావన, జీహెచ్ఎంసీ డీఈ సువర్ణ, ఏఈ దివ్యతేజ, వర్క్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, టౌన్ప్లానింగ్ ఏసీపీ సాయిబాబా, మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు, బస్తీ అధ్యక్షుడు రాంచందర్, బస్తీవాసులు రాజేశ్, ప్రతిభ, భిక్షపతి, శోభ పాల్గొన్నారు.