కీసర, జనవరి 31: దమ్మాయిగూడ మున్సిపాల్టీని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీతశ్రీకాంత్గౌడ్ తెలిపారు. దమ్మాయిగూడ మున్సిపల్ సాధారణ సమావేశాన్ని చైర్మన్ ప్రణీతగౌడ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. భవానీనగర్ కాలనీలో మురికి కాలువల నిర్మాణానికి రూ.2.80లక్షలు, జంతు సంరక్షణ కోసం రూ.25లక్షలు, నర్సరీలో మొక్కలు పెంపకం కోసం రూ.20లక్షలు, ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేయుటకు గాను పండ్లు, పూల మొక్క లు కొనుగోలుకు గ్రీన్ బడ్జెట్ నుంచి రూ.10లక్షలు, ఆఫీస్ రికార్డు రూం ఏర్పాటు రూ.20లక్షలు, సెంట్రల్ లైటింగ్ కోసం రూ.2లక్షల 15వేలు, గ్రావెల్ వేయుటకు రూ.10లక్షలు, లైమ్ పౌడర్ కొనుగోలుకు ఒక లక్ష రూపాయలు మున్సిపల్ సాధారణ నిధుల నుంచి కోటాయిస్తూ తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్రెడ్డి, కమిషనర్ స్వామి, డీఈ ఎ. సుమతి, మేనేజర్ వెంకటేశం, కౌన్సిలర్లు నానూనాయక్, సుజాత, హేమలత, వెంకటేశ్, పావనిరెడ్డి, స్వప్న, సరిత, శ్రీలత, వెంకటరమణ, అనురాధ, రమేశ్గౌడ్, నర్సింహారెడ్డి, మౌనిక, శ్రీహరిగౌడ్, కో-ఆప్షన్ సభ్యులు వహీద బేగం, చెన్నారెడ్డి, రజని, షేక్ శాదుల్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభు పాల్గొన్నారు.