కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 15 : సంక్షేమ సంఘాల ఐక్యమత్యంతోనే కాలనీలు అభివృద్ధి చెందుతాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం జీడిమెట్ల డివిజన్, ఎంఎన్రెడ్డి నగర్ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి స న్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఐక్యమత్యంతో ఉంటూ కాలనీల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, అప్పుడే కాలనీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సంపత్గౌడ్, రవీందర్, భిక్షప తి, విజయ్, బాపిరెడ్డి, రామ్మోహన్, శివకృష్ణ, శ్రీనివాస్, చంద్రశేఖర్, సత్యరామ్, రమేశ్, వీరాచారి, మునీశ్వర్, రమేశ్, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ, భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే దాసాంజనే య, మల్లికార్జునస్వామి ప్రథమ వార్షికోత్సవానికి హాజరుకావాలని కోరుతూ స్థానిక కౌన్సిలర్, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వివేకానంద్ను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.
విలేజ్ కురుమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి ఈ నెల 18,19 తేదీలలో జరిగే 52వ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
డివిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శివానంద్, ఉపాధ్యక్షులు శ్రీరాములు, మహేశ్రెడ్డి, జనరల్ సెక్రటరీ వెంకటేశ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, చాంద్పాషా, తదితరులు పాల్గొన్నారు.