సికింద్రాబాద్, మార్చి 6: సికింద్రాబాద్ నియోజకవర్గంలో వేసవికాలంలో కోతలు లేకుండా నిరంతర విద్యుత్ను అందించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్లో కనీసం 5 ట్రాన్స్ఫార్మర్లను నూతనంగా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వం రాకముందు ఎప్పుడు విద్యుత్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు లేనప్పటికీ విద్యుత్ సమస్యలు మాత్రం ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ హైఓల్టేజీతో విద్యుత్ ఉపకరణాలు టీవీలు, ఫ్రిజ్లు, ఇతర పరికరాలు కాలిపోతున్నాయి. దీనిని అరికట్టడానికి విద్యుత్ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వేసవికాలం కావడంతో వినియోగదారులు విపరీతంగా విద్యుత్ను వినియోగిస్తుండడంతో టాన్స్ఫార్మర్ర్లపై తీవ్ర భారం పెరుగుతోంది. ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ అధికంగా పడడంతో గృహోపకరణాలు కాలిపోతున్నాయి. నానాటికీ పెరుగుతున్న ఇండ్లు, అపార్ట్మెంట్ల కారణంగా విద్యుత్ మీటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. నిరంతర విద్యుత్ను అందించడం కోసం మరికొన్ని ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై డి ప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్తో కొన్ని రోజుల కిందట చర్చించారు. ట్రాన్స్ఫార్మర్లను పెంచడం కోసం అవసరమయితే ఎన్ని నిధులు అవసరమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు డిప్యూటీ స్పీకర్ అధికారులకు తెలిపారు. దీంతో ట్రాన్స్ఫార్మర్ల సం ఖ్యను తక్షణమే పెంచాలని నిర్ణయించారు.
నిరంతర విద్యుత్ను సరఫరా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో వేసవిని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫార్మర్లను బిగించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోతలు లేకుండా నిరంతర విద్యుత్ అందించడం కోసం ఎన్ని నిధులు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. -తీగుళ్ల పద్మారావు గౌడ్, డిప్యూటీ స్పీకర్