మూడు నెలలకోసారి అధికారులతో సమీక్షా సమావేశం
తుకారంగేట్లో ఆర్యూబీ పనులను ఫిబ్రవరి నెలఖారులోగా పూర్తి చేయాలి
అధికారుల సమీక్షా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆదేశాలు
సికింద్రాబాద్, డిసెంబర్ 7: సికింద్రాబాద్ పరిధిలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని, ఇకపై ప్రతి మూడు నెలలకోసారి అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని లాలాపేటలో అంతర్జాతీయ ప్రమాణాల స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అభివృధి కార్యకలాపాలపై మంగళవారం సీతాఫల్మండి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీతో పాటు జలమండలి, రెవెన్యూ, ట్రాన్స్ కో అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో వివిధ అంశాల పై చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ తుకారాంగేటులో ఆర్యూబీ నిర్మాణం పనులను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మాణికేశ్వరీనగర్ లో ఆర్యూబీ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. లాలాపేటలో రోడ్డు విస్తరణ పనులను నెల రోజుల్లోగా పూర్తయ్యే విధంగా చూడాలని, దానికి సంబంధించిన పరిహారాన్ని వెంటనే అందించాలన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఉప కమిషనర్ మోహన్రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి విజయ కుమారి, ట్రాన్స్ కో డివిజనల్ ఇంజినీర్ శ్రీధర్, జలమండలి జనరల్ మేనేజర్ రమణా రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఆశాలత, తాసీల్దార్ జానకి, సునీల్ కుమార్, అధికారులు డాక్టర్ రవీందర్ గౌడ్, గంగాధర్లతో పాటు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.