కంటోన్మెంట్, ఆగస్టు 22: సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం నుంచి నిర్వహించనున్న కొవిడ్ టీకా పంపిణీ ప్రత్యేక డ్రైవ్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసే దిశగా ప్రత్యేక డ్రైవ్ను అధికారులు చేపట్టనున్నారని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్రెడ్డి నేతృత్వంలో వివిధ బృందాలను ఏర్పాట్లు చేసినట్లు పద్మారావు గౌడ్ తెలిపారు. అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్మండి, బౌద్ధనగర్ డివిజన్ల పరిధిలో ప్రతి డివిజన్కు ఓ సంచార వాహనాన్ని ఏర్పాటు చేసి దాదాపు 126 కాలనీలు, బస్తీల్లో ఇంటింటికెళ్లి సర్వేను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.