బడంగ్పేట/పహాడీషరీఫ్/మహేశ్వరం, జూలై 20: ఆకాశానికి చిల్లులుపడ్డట్టుగా గత మూడు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. పలుచోట్ల మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మ్యాన్ హోల్స్ను క్లీనింగ్ చేసే పనిలో నిమగ్నమయారు. బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్, తుక్కుగూడ మున్సిపాలిటీల పరిధిలో సహయక చర్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సిబ్బందిని అప్రమత్తం చేసి.. సమస్యలు ఉన్నచోట పరిష్కరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల భారిన పడకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాలనీలలో పర్యటిస్తు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. కాలనీల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా సాఫీగా పోవడానికి జేసీబీల సహయంతో కాల్వలను తీయిస్తున్నారు. అన్ని కాలనీల్లో పర్యటిస్తూ.. పారిశుద్ధ్యం లోపించకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు శానిటేషన్ ఇన్స్పెక్టర్ వంకాయల యాదగిరి వెల్లడించారు.
* బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి అధ్యక్షతలో వాటర్ మెన్స్, జవాన్లతో సమావేశం నిర్వహించారు. తాగునీటి పైపులైన్లు ఎక్కడ లీక్ అయినా వెంటనే మరమ్మతులు చేయించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇండ్లలో నుంచి వస్తున్న వర్షం నీళ్లు డ్రైనేజీలోకి పోకుం డా కాలనీల్లో ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల భారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ బి.సుమన్ రావు, డీఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
* నిరవదికంగా కురుస్తున్న వర్షాల కారణంగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ వసంత సూచించారు. పారిశుద్ధ్యం లోపించకుండా, రహదారుల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో కాలనీ, బస్తీల్లో ముంపు సమస్యలు దూరం చేసేందుకు అధికారులు మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్న సూపర్వైజర్కు బాధ్యతలు అప్పగించారు. మాన్సూన్ సిబ్బంది షిప్టుల వారీగా 24 గంటలు అందుబాటులో ఉంటారని, ప్రతి టీమ్కు నలుగురు సిబ్బంది, జేసీబీ, ట్రాక్టర్, జెట్టింగ్ మిషిన్ అందుబాటులో ఉంచారు. మున్సిపాలిటీ పరిధిలో అత్యవసర పనుల కోసం షిప్టుల వారీగా సిబ్బంది 24 గంటలు పని చేసే విధంగా 2 టీమ్లను ఏర్పా టు చేశారు. 1 టీమ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, రెండో టీమ్ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అత్యవసర విధుల్లో ఉంటారు.
* మహేశ్వరం మండలంలో గురువారం అత్యధికంగా 46.1 మి. మీటర్ల వర్షం కురిసిందని తాసీల్దార్ మహమూద్ అలీ తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటల వద్దకు ప్రజలు వెళ్లవద్దని ఆయన సూచించారు. వర్షాలకు చెరువులు కుంటలలోకి నీరు వచ్చి చేరుతుందని, ప్రజలు, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు కోరారు. వానలు కొద్దిగా లేటుగా పడినగాని పంట పొలాలకు అనుకూలంగా ఉంటుందని రైతులు అంటున్నారు.
ముందస్తు చర్యలు చేపడుతున్నాం
మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 28 వార్డుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్లు గురువారం నుంచి అందుబాటులో ఉంటారు. వరదనీటి సమస్య ఉందని హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇసే ్త వెంటనే మాన్సూన్ సిబ్బంది అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికానవసరం లేదు. కాలనీ, బస్తీ వాసులు సిబ్బందికి సహకరించాలి.
– అబ్దుల్లా సాది, జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్