మణికొండ : అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నార్సింగి మున్సిపల్ కమిషనర్ సత్యబాబు అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని గౌలిదొడ్డిలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండగా పలుమార్లు అధికారులు నోటీసులు జారీచేసిన పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కొన్నిచోట్ల అనధికారికంగా నిర్మాణాలను చేపడుతుండగా కొంతమంది ప్రజాప్రతినిధులు కొమ్ముకాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని సైతం కూల్చివేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. గురువారం గౌలిదొడ్డిలో పలుచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
హెచ్ఎండీఏ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వర్రావు మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా వెలిశాయని ఉన్నతాధి కారులకు నివేదించి కూల్చివేతలపై అనుమతులు పొందనున్నట్లు తెలిపారు.