హైదరాబాద్: రాజేంద్రనగర్ (Rajendra Nagar) పరిధిలోని మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) కారు బీభత్సం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున మైలార్దేవ్పల్లిలోని దుర్గానగర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది (Raod accident). దాని వెనక వచ్చిన మరోకారు.. దానిని గుద్దుకిన రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుడిని చంద్రశేఖర్గా గుర్తించారు. అతడు డిగ్రీ చవుతున్నాడని తెలిపారు (Degree student). గాయపడిన ఇద్దరు కూడా విద్యార్థులేనని, వారంతా మద్యం మత్తులో (Drunk and Drive) ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.