హైదరాబాద్ : సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్నాయి. చుట్టు పక్కల బిల్డింగ్లకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో ఈ బిల్డింగ్ను కూల్చివేయనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కూల్చివేత పనుల్లో అక్కడున్న ఇతర భవనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీకి సూచించారు. ఏదైనా ఇబ్బంది అయితే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆలస్యం అయిన సజావుగా కూల్చివేత పనులు జరగాలని సూచించారు. డెక్కన్ బిల్డింగ్ సమీప ప్రాంత ప్రజలకు సమీపంలోని కమ్యూనిటి హాల్లో బస ఏర్పాటు చేశామని మంత్రి తలసాని పేర్కొన్నారు.
డైమండ్ కటింగ్తో ఒకేసారి భవనం కూప్పకూలకుండా, ఒకవైపు ఒరగకుండా కూల్చివేయడం హైడ్రాలిక్ క్రషర్ యంత్రం ప్రత్యేకత. కూల్చివేత ప్రక్రియలో భాగంగా బుధవారం టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. రూ.33.86 లక్షల అంచనా వ్యయంతో టెండర్ను పిలువగా, నగరానికి చెందిన ఎస్కే మల్లు ఏజెన్సీకి రూ. 25.94 లక్షలకు పనులను అప్పగించారు. వారం నుంచి పది రోజులలో డెక్కన్ మాల్ భవనాన్ని పూర్తి స్థాయిలో కూల్చివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.