హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు(Government teacher) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన నగరంలోని మియాపూర్ (Miyapur) ఓయో లాడ్జిలో(Oyo Lodge) చోటు చేసుకుంది. అయితే విషం మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు లాడ్జి గదిలో ఆవనవాళ్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతం జయ ప్రకాష్ రాయచోటిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.