హైదరాబాద్ : హయత్నగర్ సమీపంలోని బొంగులూరు వద్ద తల లేని మృతదేహాం లభ్యమైంది. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు పక్కన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని పోలీసులు ఇవాళ వెలికితీశారు. మృతుడిని నల్లగొండ జిల్లా వద్దిపట్ల వాసి నామా శ్రీనివాస్(42)గా పోలీసులు గుర్తించారు.
నామా శ్రీనివాస్ 40 రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. అయితే శ్రీనివాస్ను హత్య చేసిన బ్రహ్మచారి ఇవాళ సరూర్ నగర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. బ్రహ్మచారి ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. శ్రీనివాస్ను హత్య చేసి బొంగులూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టాడు బ్రహ్మచారి. ఘటనాస్థలిలో గడ్డపార, రెండు గంపలు, తీగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.