హైదరాబాద్ : ప్రియుడితో కలిసి కూతురు తల్లిని హత్య చేసింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్చార్జి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముండే యాదమ్మ(35), యాదయ్యల చిన్న కుమార్తె.. రామ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. తరచూ అతడు ఇంటికి వస్తుండటంతో తల్లి మందలించింది.
దీంతో సోమవారం కూతురు ప్రియుడితో కలిసి యాదమ్మకు ఉరి వేసి హత్య చేసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.