కొండాపూర్ : దసరా పండుగ వినియోగదారులకు ముందుగానే సందడిని తీసుకొచ్చింది. వినియోగదారులకు ముందస్తు వేడుక సంబరాలతో పాటు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మహా నగరంలో ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ పత్రికలు వారం రోజులుగా ముందస్తు దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా దసరా బొనాంజా-లక్కీ డ్రా విజేతల వివరాలను శుక్రవారం గచ్చిబౌలిలోని నిస్సాన్ షో రూమ్లో జనరల్ మేనేజర్ చిర్ర రాజిరెడ్డి తెలిపారు. డ్రాలో మొదటి బహుమతి (32 ఇంచుల ఎల్ఈడీ కలర్ టీవీ)ని విష్ణు దత్త గెలుపొందగా, రెండో బహుమతి (మొబైల్ ఫోన్) ని రాహుల్ గెలుచుకున్నాడు.
మూడు, నాల్గు, ఐదో బహుమతులను మహిందర్రెడ్డి, అనూషా, గౌతమ్ గెలుచుకున్నా రు. కాగా, ‘షాపింగ్ పూర్తి చేసుకుని వెళ్తున్న సమయంలో లక్కీ డ్రాకు సంబంధించిన కూపన్ నింపాల్సిందిగా సిబ్బంది తెలపడంతో, తన అబ్బాయి విష్ణు దత్త పేరుతో వివరాలను నింపగా మొదటి బహుమతి కలర్ టీవీని పొందడం చాలా ఆశ్చర్యం వేసింది. ఇంక చాలా సంతోషంగా కూడా ఉంది’ అని మొదటి బహుమతి విజేత తల్లి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిస్సాన్ వైబ్రైంట్ ఏరియా సేల్స్ మేనేజర్ జీబీ ఆనంద్, సిబ్బంది, ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ డీజీఎంలు ప్రవీణ్ కుమార్, విజయ్ కులకర్ణి, రాజిరెడ్డి, చరణ్ పాల్గొన్నారు.
మారుతున్న ప్రపంచంతో పోటీ పడుతూ ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్తో అప్డేట్ వెర్షన్ వెహికల్స్ను నిస్సాన్ వినియోగదారులకు అందిస్తుంది. కస్టమర్స్ కోరుకునే అన్ని రకాల సౌకర్యాలు, సురక్షితను దృష్టిలో పెట్టుకుని వెహికల్స్ డిజైన్స్ ఉంటాయి. వినియోగదారులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రయాణాలను అందించేందుకు సంస్థ ముందు వరుసలో ఉంటుంది. – జీబీ ఆనంద్, ఏరియా సేల్స్ మేనేజర్
‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’ పాఠకులు, ప్రకటనకర్తలు, దసరా బొనాంజాకు సహకరిస్తున్న సంస్థల వినియోగదారులకు పండుగ సంతోషాన్ని ముందుగానే అందించేందుకు నాలుగేళ్లుగా ఈ బొనాంజాను నిర్వహిస్తున్నాము. ఈ ఏడాది సైతం అదే స్థాయిలో సంతోషాన్ని పంచుతూ వారం రోజులుగా ప్రతిరోజు ఐదుగురిని లక్కీ డ్రాలో విజేతలుగా ఎంపిక చేస్తున్నాము. అయితే, బంపర్ డ్రాలో డాట్సన్ రెడీ గో కారును విజేత అందుకోనున్నారు. – ప్రవీణ్, డీజీఎం, ‘నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే’
వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలందించేందుకు నిస్సాన్ ఎప్పుడూ ముందుంటుంది. మారుతున్న ప్రపంచానికి సాటిగా ఆత్యాధునిక టెక్నాలజీలతో వినూత్న మోడల్స్తో నిస్సాన్ మార్కెట్లోకి వాహనాలను తీసుకు వస్తుందన్నారు. కస్టమర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తూ, అందంగా, ఆకర్షణీయంగా, అన్ని విధాల సౌకర్యవంతమైన వాహనాలను నిస్సాన్ అందిస్తుంది. – రాజిరెడ్డి చిర్ర, జనరల్ మేనేజర్
నిస్సాన్ వెహికల్స్ అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీగా అత్యాధునిక టెక్నాలజీలతో వాహనాల డిజైనింగ్ సైతం ఆకట్టుకునేలా ఉంటాయి. చాలా రకాల కార్లను డ్రైవింగ్ చేశాను. నిస్సాన్ వెహికల్స్లో డ్రైవింగ్ చాలా కంఫర్ట్గా ఉండటంతో పాటు మైలేజీ బాగా వస్తుంది. దసరా పండుగకు నిస్సాన్ కారును కొనేందుకు షోరూమ్ వచ్చాము. – జి.సతీష్, వినియోదారుడు