బన్సీలాల్పేట్ : దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, ఇది తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.సుదర్శన్బాబు అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్, పేద దళిత కుటుంబాలలో వెలుగులు నింపడానికి కృషి చేయడం అభినందనీయమని, ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని వారు కోరారు. ఎస్సీఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంగం శివశంకర్, హైదారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్మ మహేందర్, రాపాక అశోక్, దేశపాక గోవర్థన్లు పాల్గొన్నారు.