సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ) ;ప్రకృతిని కాపాడుకుందాం..అది మనల్ని కాపాడుతుంది. అమ్మకు సమానమైనది ప్రకృతి అనే థీమ్తో హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి నుంచి ఇనార్బిట్ మాల్ వరకు సుమారు పది కిలో మీటర్ల సైక్లింగ్ రైడ్ ఆదివారం జరిగింది. ఈ రైడ్లో 600 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన జీవనానికి ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి అన్నారు. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆప్ట్రోనిక్స్ నిర్వహించిన 10 కిలోమీటర్ల సైక్లోథాన్ను ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిట్నెస్పై అవగాహనతో పాటు ప్రోత్సాహాన్ని అందించేందుకు సైక్లోథాన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 10 కిలోమీటర్ల పాటు సాగిన సైక్లోథాన్ గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రారంభమై మాదాపూర్లోని ఇనార్బిట్మాల్ వరకు సాగింది. ఇందులో 800లకు పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. సైక్లోథాన్లో పాల్గొన్న వారికి టీ షర్ట్లు, గుడీస్, రిఫ్రెష్మెంట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఆప్ట్రోనిక్స్ సీఈఓ మేఘనా సింగ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతిని కాపాడుకుందాం
‘ప్రకృతిని కాపాడుకుందాం.. అది మనల్ని కాపాడుతుంది. అమ్మకు సమానమైనది ప్రకృతి.’ ఈ థీమ్తో హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి నుంచి ఇనార్బిట్ మాల్ వరకు సుమారు పది కిలో మీటర్ల మేర సైక్లింగ్ రైడ్ ఆదివారం జరిగింది. ఈ రైడ్లో 600 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. మదర్స్ డే సందర్భంగా ప్రకృతిని కాపాడుకోవడం అంటే అమ్మకు సేవ చేయడం లాంటిదేనని హెచ్సీజీ ఫౌండర్ నందనూరి రవీందర్ తెలిపారు. సైక్లింగ్ వినియోగం పెరిగితే కాలుష్యం బారినుంచి బయటపడొచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతి పనికి వాహనం కాకుండా సైకిల్ వినియోగించాలని నగరవాసులకు ఆయన సూచించారు. మనకు జన్మనిచ్చిన అమ్మ.. మనల్ని కాపాడుతున్న ఈ ప్రకృతిని రక్షించుకోవడంలో అందరూ నిస్వార్థంగా సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఎన్జీఓ సభ్యులు పాల్గొన్నారు.