సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : హ్యాపీ హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్నకు చెందిన పవన్ కుమార్ ‘మాదక ద్రవ్యాల నిర్మూలన’ పై అవగాహన కల్పించేందుకు బెంగళూరు టూ కన్యాకుమారి సైక్లింగ్ యాత్రకు సిద్ధమయ్యాడు. డ్రగ్స్తో విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరుతూ ఆయన శనివారం ఈ రైడ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ సైక్లిస్టుల ఆధ్వర్యంలో ఈ రైడ్ కొనసాగుతుందని వివరించారు. ‘ సే నో టూ డ్రగ్స్’ ప్లకార్డ్తో అవగాహన కల్పించనున్నారు.
ఈ సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం దేశంలో విరివిగా పెరుగుతున్నదని.. ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సైక్లింగ్తో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని.. ఇప్పుడు డ్రగ్స్ నిర్మూలనకు అవగాహనకల్పించాలని, సైక్లింగ్ రైడ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు.