జగిత్యాల : జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ఆత్మీయ కానుక అందించారు. కవితను మంత్రి కొప్పుల దంపతులు ఇంటికి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కవితను మంత్రి దంపతులు సన్మానించి, ఆడపడుచు కానుకను అందజేశారు.