సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): క్రిప్టో ట్రేడింగ్ పేరుతో నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.1.4.5 లక్షలు సైబర్నేరగాళ్లు దోచేశారు. లాల్దర్వాజాకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి వాట్సాప్కు ఓ మహిళ ఫోన్ చేసి క్రిప్టో ట్రేడింగ్లో భారీ లాభాలున్నాయని, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో చేరాలని సూచించింది. ఆమె చెప్పిన విషయాలకు ఆకర్షితుడైన బాధితుడు టెలిగ్రామ్ గ్రూప్లో చేరాడు. తరువాత క్రిప్టో ట్రేడింగ్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వెయ్యి రూపాయలు ముందుగా పెట్టుబడి పెట్టడంతో రూ. 1300 వచ్చాయి.
ఆ తరువాత రూ. 5 వేలు పెట్టుబడి పెట్టగా రూ. 6900 లాభం కన్పించింది. క్రిప్టో ట్రేడింగ్ బాగుందంటూ లక్షల రూపాయలు వెచ్చిస్తుండటంతో స్క్రీన్ పై లాభాలు కన్పిస్తూ వెళ్లాయి. ఆ లాభాలను విత్డ్రా చేసుకొనే అవకాశం లేకపోవడంతో పాటు వాటిని డ్రా చేసుకోవాలంటే పన్నులు చెల్లించాలంటూ నిర్వాహకులు చెబుతూ దఫాదఫాలుగా రూ. 14.5 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించి బాధితుడు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.