సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఫంక్షనల్ వర్టికల్స్లో సైబరాబాద్ కమిషనరేట్ రాష్ట్రంలోనే టాప్లో నిలిచిందంటూ డీజీపీ మహేందర్రెడ్డి ప్రశంసించారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఫంక్షనల్ వర్టికల్స్పై డీజీపీ మంగళవారం రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో 13 వర్టికల్స్లో సైబరాబాద్ కమిషనరేట్ టాప్లో ఉండటంతో సైబరాబాద్ పోలీసులకు డీజీపీ అభినందనలు తెలిపారని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.