Heavy Rains | హైదరాబాద్తో పాటు తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే, వర్షాల నేపథ్యంలో రోడ్లపై భారీగా నీరు చేరుతున్నది. దాంతో వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు. అదే సమయంలో వర్షాలతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలుగుతున్నది. పలుచోట్ల గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో పోలీసులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ జామ్కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నగర పరిధిలోని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు మరోసారి కీలక సూచనలు చేశారు. వర్క్ ఫ్రమ్ హోం అవకాశం పరిశీలించాలని ఐటీ కంపెనీలకు సూచించారు. వర్క్ ఫ్రమ్ హోం వీలుకాని పక్షంలో పనివేళల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి ఐదురోజుల పాటు పనివేళలలు మార్చాలని ట్రాఫిక్ పోలీసుల కోరారు. ఐటీ ఉద్యోగులకు మూడు దశల్లో విధుల ముగింపు వేళలు ఉండాలని సూచించారు.
నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల పని వేళల్లో మార్పులను ఈ నెల 27 నుంచి వచ్చే నెల 1 వరకు కొనసాగించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పరకుండా మూడు దశల్లో దశలుగా లాగ్అవుట్ ఉండాలని సూచించారు. ఐకియా నుంచి సైబర్ టవర్స్ మార్గంలోని సంస్థలు, రహేజా మైండ్స్పేస్లోని కంపెనీలు, టీసీఎస్, హెచ్ఎస్బీసీ, డెల్, ఫీనిక్స్, ఒరాకిల్, క్వాల్కామ్, టెక్ మహీంద్ర, పూర్వా సమ్మిట్లోని కంపెనీలు మధ్యాహ్నం 3 గంటలకు లాగ్అవుట్ చేయాలని సూచించారు. ఐకియా, బయోడైవర్సిటీ, రాయదుర్గం సమీప ప్రాంతాల్లోని నాలెడ్జ్ సిటీ, నాలెడ్జ్ పార్క్, టీహబ్, గెలాక్సీ, ఎల్టీఐ అండ్ ట్విట్జా, కమర్జోమ్, ఆర్ఎంజడ్ నెక్సిటీ, స్కైవ్యూ, దివ్యశ్రీ ఓరియన్, అసెండాస్, ఇతర కంపెనీలు సాయంత్రం 4 గంటలకు.. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, సెంటారస్, బ్రాడ్వే, విర్టుసా, బీఎస్ఆర్ ఐటీపార్క్, ఐసీఐసీఐ, వేవ్రాక్, అమెజాన్, హనీవెల్, హిటాచీ, సత్వా క్యాపిటల్, క్యాప్ జెమిని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, క్యూసిటీ, డీఎల్ఎఫ్, ఇతర ఐటీ పార్కుల్లోని కంపెనీలు మధ్యాహ్నం 3-6 గంటల మధ్య లాగ్ అవుట్ చేయాలని సైబరాబాద్ పోలీసులకు సూచించారు.