సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ):సినీ నటి రేణు దేశాయ్పై సోషల్ మీడియాలో అస్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… గుంటూరు ప్రాంతానికి చెందిన రుంజాల చెన్నయ్య తరచూ యూట్యూబ్లో రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తాడు. ఇటీవల ప్రముఖ నటి రేణు దేశాయ్పై ఒక రీల్ను వీక్షించిన చెన్నయ్య తన యూట్యూబ్ ఖాతా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలతో పోస్ట్ చేశాడు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు గుంటూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనంతరం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుంటూరులో నిందితుడిని అరెస్టు చేసి, నగరానికి తరలించారు.
ఇలా చేస్తే కేసులు తప్పవు