మేడ్చల్, జనవరి 17 : మేడ్చల్ పోలీసు స్టేషన్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏసీపీ వెంకట్ రెడ్డి, ఇన్స్పెక్టర్ నర్సింహరెడ్డి, ఎస్సైలతో మాట్లాడారు. విధుల నిర్వహణ, నమోదవుతున్న కేసులు, పరిష్కారం.. తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రికార్డులను పరిశీలించారు. దాదాపు గంట పాటు అధికారులతో మాట్లాడారు. తిరిగి వెళ్తూ పోలీస్స్టేషన్ ఆవరణలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మేడ్చల్లో గతేడాది ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని కూడా పరిశీలించారు.