హైదరాబాద్ : కేపీహెచ్బీ పోలీసుల( KPHB police)పై విచారణ(Inquiry)కు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి(Cyberabad CP Avinash Mahanthy) ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..ప్రణీత్ అనే యువకుడు తన భార్యతో గొడవపడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీసులు విచారణ కోసం స్టేషన్ ప్రణీత్ను పిలిపించారు. అయితే పోలీసులు విచారణ పేరుతో తనన చితకబాదారని బాధితుడు ప్రణీత్ సీపీ అవినాష్కు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన సైబరాబాద్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. కాగా, ప్రతీణ్కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.