హైదరాబాద్: సైబరాబాద్ (Cyberabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాసును సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి (CP Avinash Mahanthi) ఆదేశాలు జారీచేశారు.
కేపీహెచ్బీలో వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసినందుకుగాను ఇన్స్పెక్టర్ వెంకట్పై చర్యలు తీసుకున్నారు. భార్యాభర్తల వివాదంలో జోక్యం చేసుకున్న సీఐ వెంకట్ ఆ వ్యక్తిని చితకబాదారు. మరో కేసు విషయంలో కూడా సరిగా విచారణ చేయనందుకుగాను శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు వేశారు.