కరోనా కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు.. కరోనా వచ్చింది.. మెడికల్ ఎమర్జెన్సీ ఉంది.. అర్జెంట్గా డబ్బులు పంపించాలంటూ స్ఫూపింగ్ మెయిల్స్ పంపించి మోసాలకు పాల్పడ్డారు. అలాగే కరోనా వ్యాక్సిన్లు ఇస్తామంటూ నమ్మించి బురిడీ కొట్టించారు.. మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి ఖాతా ఖాళీ చేశారు.. ఇలా పలువురు సైబర్ నేరగాళ్లబారినపడి మోసపోయి.. సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు..
పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన ఇద్దరు వ్యాపారుల పేరుతో సైబర్ నేరగాళ్లు.. తమ కుటుంబ సభ్యులు కరోనాతో బాధపడుతున్నారు.. మెడికల్ ఎమర్జెన్సీ ఉంది.. అర్జెంట్గా డబ్బులు అవసరం ఉన్నాయి.. తమ లెటర్ప్యాడ్పై లేఖ పంపిస్తున్నాం.. అందులోని ఖాతాకు డబ్బులు బదిలీ చేయాలని వారి ఖాతాలు ఉన్న బ్యాంకులకు స్ఫూపింగ్ మెయిల్స్ పంపించారు.. ఇది నిజమేనని నమ్మిన బ్యాంకువాళ్లు వేర్వురుగా రూ. 28.60 లక్షలు బదిలీ చేశారు. అసలు విషయం తెలుసుకున్న బ్యాంకువారు వేర్వేరుగా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.