Cyber Crime Police | హైదరాబాద్ : సోషల్ మీడియా ట్రోలర్స్( Social Media Trolls )కు సైబర్ క్రైమ్ పోలీసులు( Cyber Crime Police ) నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా ( DCP Sneha Mehra ) మీడియాతో మాట్లాడారు.
20 మంది ట్రోలర్స్పై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 8 మంది ట్రోలర్స్కు 41(ఎ) కింద నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సబ్స్కైబర్లను పెంచుకునేందుకు మార్ఫింగ్ చేస్తున్నారని తెలిపారు. సెలబ్రెటీల వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు. ఫోటో, వీడియోల మార్ఫింగ్ చట్టరీత్యా నేరం అని స్పష్టం చేశారు. మహిళలను కించపరిచేలా ట్రోల్స్, మీమ్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలపై ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత( MLC kavitha )పై ఇటీవల ఎక్కువగా ట్రోలింగ్ జరిగింది. వ్యూస్ కోసం యువత ట్రోలింగ్ చేస్తున్నారని డీసీపీ మెహ్రా తెలిపారు.