పెండ్లి చేసుకుంటానంటూ నమ్మిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు సైబర్నేరగాడు రూ.4.4 లక్షలు టోకరా వేశాడు. దోమలగూడకు చెందిన ఓ యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. భారత్ మ్యాట్రిమోనిలో పెండ్లి కోసం ప్రొఫైల్ అప్లోడ్ చేసింది. అది చూసిన సైబర్నేరగాడు తాను నవర్టీస్ హోటల్లో పనిచేస్తున్నాని, తన తల్లిదండ్రులు చెన్నైలో ఉంటారని చెప్పుకున్నాడు. తాను పెండ్లి చేసుకోవడానికి సిద్ధమంటూ ముందుకు రావడంతో యువతి కూడా పెండ్లికి ఒప్పుకుంది. అయితే తాను అమెరికా వెళ్లేందుకు వీసా ప్రాసెసింగ్ చేసుకుంటున్నాని, తనతో పాటు ఆమెకు కూడా ప్రాసెసింగ్ చేయాలంటే రూ.7.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయించాలని చెప్పాడు.
ఆమె కోసం రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తానని.. మిగతా సొమ్ము ఇస్తే వీసా ప్రాసెసింగ్ పూర్తవుతుందని నమ్మించాడు. ఆ తర్వాత సదరు యువతి సైబర్నేరగాడు సూచించిన బ్యాంకు ఖాతాలో రెండు దఫాలుగా డబ్బు డిపాజిట్ చేసింది. ఇంకా డబ్బు కావాలంటూ అడుగుతుండటంతో అనుమానం వచ్చింది. చివరకు అంతా మోసమని గుర్తించి ఆదివారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.