హైదరాబాద్ : హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్గా సీవీ ఆనంద్ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్కు అంజనీ కుమార్ బాధ్యతలు అప్పగించి శుభాకాంక్షలు తెలిపారు. సీపీ అంజనీ కుమార్ అవినీతి నిరోధక శాఖ డీజీగా బదిలీ అయిన సంగతి తెలిసిందే.
సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సీపీగా తనను నియమించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నగరం దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది. పెద్ద నగరానికి సీపీగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. భిన్న మతాల సమ్మేళనం హైదరాబాద్ సొంతం అని సీపీ పేర్కొన్నారు. పోలీసు శాఖలో ఎన్నో సంస్కరణలు వచ్చాయి. హైదరాబాద్ కమిషనరేట్లో ఎన్నో ఏండ్లు పని చేశానని గుర్తు చేశారు. నగరంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తాం. సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ కట్టడికి ఇప్పటికే డ్రైవ్ నడుస్తోందని తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సీవీ ఆనంద్ సూచించారు.