శంషాబాద్ రూరల్, డిసెంబర్ 29: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి గురువారం బంగారం స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈకే 528 నంబర్ గల విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు ఎవరికీ అనుమానం రాకుండా పేస్టు రూపంలో బంగారం తీసుకొస్తున్నాడు.
అతడిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులకు 827 గ్రాముల బంగారం లభించింది. బంగారం విలువ రూ. 46.51 లక్షల ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.