హైదరాబాద్: బిర్యాని (Biryani) తినడానికి హోటల్కి వచ్చిన వినియోగదారుడు, అక్కడి సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో వినియోగదారుడు మృతిచెందాడు. హైదరాబాద్ చాంద్రాయగుట్ట (Chandrayangutta) ప్రాంతానికి చెందిన లియాకత్.. ఆదివారం రాత్రి పంజాగుట్టలోని మెరీడియన్ హోటల్కు (Meridian hotel) బిర్యాని తినడానికి వచ్చాడు. తనకు పెరుగు కావాలని సిబ్బందిని అడిగాడు. ఈ క్రమంలో హోటల్ సిబ్బందికి, లియకత్కు మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో అతనిపై సిబ్బంది దాడిచేశారు. విషయం తెలుకుసున్న పోలీసులు హోటల్కు చేరుకుని ఇరు వర్గాలను స్టేషన్కు తీసుకెళ్లారు.
వారితో మాట్లాడుతుండగానే లియాఖత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దవాఖానకు తరలించారు. అయితే అతడు చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో దాడికి పాల్పడిన హోటల్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని లియాఖత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.