Nampally Court | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని నాంపల్లి కోర్టులో కూడా గురువారం కరెంట్ పోయింది. మధ్యాహ్నం సమయంలో ఓ కేసుకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండగా, పవర్ కట్ అయింది. దీంతో జడ్జి చీకట్లోనే వాదనలు వినాల్సి వచ్చింది. కరెంట్ కోతలపై లాయర్లు, కోర్టు సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కరెంట్ కోతల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా చాలా చోట్ల జనరేటర్లను సమకూర్చుకుంటున్నారు.