హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం గాంధీ దవాఖానను పరిశీలించారు. దవాఖానలో పడకలు, ఆక్సిజన్ లభ్యత, కొవిడ్ రోగులకు అందుతున్న తదితర సేవలను వైద్యాధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు.
బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ రోగులకు అందుతున్న సేవలను సీఎస్ సోమేశ్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే నగరంలోని పలు దవాఖాలను ఆయన తనిఖీ చేసి వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. దవాఖానలో వసతులు, మందుల కొరత లేకుండా మెరుగైన సేవలందేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.