కాచిగూడ,సెప్టెంబర్ 7: పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఓ వ్యక్తిపై దాడి చేసిన రౌడిషీటర్పై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై బి.నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గోల్నాక డివిజన్లోని సుందర్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ గయాస్(36),అదే ప్రాంతానికి చెందిన రౌడిషీటర్ మహ్మద్ సమీయుద్దిన్లకు కొంత కాలం క్రితం ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు పగలు పెంచుకున్నారు.
ఆదివారం రాత్రి సుందర్నగర్ నుంచి గయాస్ వెలుతుండగా ఇదే అదునుగా భావించిన రౌడిషీటర్ సమీయుద్దిన్ గయాస్ను అడ్డుకుని ఉద్దేశ పూర్వకంగా గ్యాస్స్టాప్ రెగ్యులేటర్తో దాడి చేసి విచక్షణారహిత్యంగా చితకబాది పారిపోయారు. దీంతో గయాస్ తలకు తీవ్ర గాయలైనాయి. గయాస్ పిర్యాదు మేరకు సమీయుద్ధిన్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.