శంషాబాద్ రూరల్, జనవరి 9: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో మైహోమ్ గ్రూపు సంస్థ, ఖుషీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్మించిన ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని మంగళవారం మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, మైహోమ్ గ్రూపు సంస్థల ఎండీ జూపల్లి జగపతిరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యను మించిన సంపద ప్రపంచంలో మరొక్కటిలేదని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత చంద్రయ్య, మాజీ సర్పంచ్ బీర్ల పెంటయ్య, ఉప సర్పంచ్ రాజు పాల్గొన్నారు.