పలు స్టాల్స్ ప్రతినిధులకు అవార్డులను అందించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర
మాదాపూర్, మే 1: మాదాపూర్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ఆదివారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర విచ్చేసి క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వి.రాజశేఖర్రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణ, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు డి.మురళీ కృష్ణారెడ్డిలతో కలిసి హాజరై కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ప్రతినిధులకు అవార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలోని భూములకు అధిక డిమాండ్ ఉందని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మహిళలు సైతం రాణిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. మూడు రోజుల పాటు కొనసాగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు 50 వేల మంది సందర్శకులు విచ్చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన 30 స్టాల్స్ ప్రతినిధులకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఇందులో ప్లాటినం, గోల్డ్, డైమండ్ అవార్డులను అందజేశారు.