CP Ramesh Reddy : పోక్సో(POCSO) కేసులో ఇరుక్కున్న బండి భగీరథ్ (Bandi Bhageerath) పోలీసులు ఎదుట లొంగిపోయాడనే వార్తలను సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి(CP Ramesh Reddy) ఖండించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) చెబుతున్నట్టు భగీరథ్ లొంగిపోలేదని, అతడిని తాము అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.
నార్సింగి పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ను అదుపులోకి తీసుకున్నామని, అక్కడి నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించామని సీపీ వెల్లడించారు. దాంతో, ఎంపీ బండి సంజయ్ చెప్పిన లొంగుబాటు కథంతా ఉత్తదే అన్నమాట. అరెస్ట్ అనంతరం వైద్య పరీక్షల నిమ్మతం భగీరథ్ను మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాసేపట్లో అతడిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి అవకాశముంది. ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే.