సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ వల్ల పారిశ్రామిక రంగానికి ఇబ్బంది లేకుండా పనులు సజావుగా సాగించుకునేందుకు ప్రభుత్వం జీవో 102, జీవో8ని అమలు చేస్తున్నదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ-ఎఫ్టీసీసీఐ, ఎఫ్ఐసీసీ సంయుక్తంగా మంగళవారం ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కాన్ఫరెన్స్లో పారిశ్రామికవేత్తలు రమాకాంత్ ఇనాని, ఖ్యాతి నారావేని, కె.భాస్కర్రెడ్డి, అనిల్ అగర్వాల్, టి.సుజాత, మురళీధరన్, మురళీ కృష్ణరెడ్డి, అఖిలేశ్ మహురకర్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ 2.0 మార్గదర్శకాలపై సమావేశంలో చర్చించారు. కార్మికుల హాజరు, సామగ్రి తరలింపుపై నెలకొన్న అనుమానాలు, ఇతర అంశాలపై ఉన్న సందేహాలను పారిశ్రామిక వేత్తలు ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్తో మాట్లాడి నివృత్తి చేసుకున్నారు.