హైదరాబాద్: కరోనా సమయంలో చాలా మంది నిరుద్యోగులయ్యారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నాంపల్లి రెడ్రోజ్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన జాబ్ మేళాను సీపీ ప్రారంభించారు. కమిషనరేట్ పరిధిలో జాబ్మేళాను నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఉద్యోగ మేళాకు ముందుకొచ్చిన కంపెనీలకు ధన్యవాదాలు తెలిపారు. రెండేండ్లలో కమిషనరేట్ పరిధిలో 33 శాతం మహిళలకు ఉద్యోగాలు కల్పించామన్నారు. జాబ్ మేళాలో 24 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.