సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్ 19 ఇన్ఫెక్షన్ పెరుగుతూ పోతున్నది. ఇది గత ఏడాది కంటే ఎక్కువగా నమోదవుతున్నది. ఈ నేపథ్యంలో మందులు కొనేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు సూచించారు. విపత్కర పరిస్థితుల్లో అవసరమైన మందులను కొందరు బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్నారని, అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు తెలుపాలన్నారు. రెమిడిసివర్ బ్లాక్లో విక్రయిస్తున్న 40మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశామన్నారు. ఈ సందర్భంగా మందులు కొనుగోలు చేసే సమయంలో నకిలీ మందుల విక్రయదారుల నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఇవి పాటించాలి..!