నిత్య సేవకుల (సూపర్ స్ప్రెడర్లు)కు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం 9 కేటగిరీలుగా సూపర్ స్ప్రెడర్స్ను గుర్తించి వారికి టీకాలు వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు వార్డుల వారీగా జీహెచ్ఎంసీ సూపర్ స్ప్రెడర్స్ వద్దకే నేరుగా వెళ్లి టోకెన్లు జారీ చేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3 లక్షల మంది ఉన్నట్లు గుర్తించిన అధికారులు నేటి నుంచి 10 రోజులపాటు వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే వ్యాక్సినేషన్కు వివిధ వ్యాపార సంస్థలు, దుకాణాల్లో పనిచేసే వారు తమకు కేటాయించిన సమయంలో వ్యాక్సిన్ సెంటర్కు వెళ్లాలని అధికారులు సూచించారు.