సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ ) : నిత్య సేవకుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ‘స్పెషల్ వ్యాక్సినేషన్’ డ్రైవ్లో 45 ఏండ్లలోపు వారు అత్యధికంగా ఉంటున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో 91, 565 మంది టీకాలు వేసుకుంటే ఇందులో 70,102 మంది 18-44 సంవత్సరాల మధ్య ఉన్న వారే ఉండటం గమనార్హం. 45 ఏండ్లలోపు దాదాపు 78 శాతం మంది ఉన్నారు. ఇక 45 ఏండ్లు పైబడిన వారు 21, 463 మంది మొదటి డోస్ తీసుకున్నారు. కాగా, సోమవారం 31 కేంద్రాల్లో కొనసాగిన వ్యాక్సినేషన్ డ్రైవ్లో 24, 897 మందికి టీకా వేసినట్లు అధికారులు తెలిపారు.